మోదీకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఆర్జేడీ నేత..

     Written by : smtv Desk | Wed, Apr 11, 2018, 04:35 PM

మోదీకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఆర్జేడీ నేత..

బీహార్, ఏప్రిల్ 11 : ప్రధాని నరేంద్రమోదీ కు బీహార్ ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. ఒక రాష్ట్రంలో వారం రోజుల్లో 8.5 లక్షల మరుగుదొడ్లు ఎలా నిర్మించారంటూ హేళన చేశారు. నిన్న బీహార్‌లో జరిగిన చంపారన్ సత్యాగ్రహ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ... ‘‘గత వారం రోజుల్లో బీహార్ ప్రభత్వం 8.5 లక్షలకు పైగా మరుగుదొడ్లు నిర్మించడం మామూలు విషయం కాదు. త్వరలోనే బీహార్ జాతీయ సగటును అందుకోవడం ఖాయం..’’ అని తెలిపారు.

తాజాగా ఈ విషయంపై తేజస్వి యాదవ్ తనదైన శైలిలో వ్యంగాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా లెక్కలతో సహా గణిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. దీనిపై తేజస్వి యాదవ్ లెక్కలతో సహా గణిస్తూ ట్వీటర్లో స్పందించారు. "వారం రోజుల్లో 8.5 లక్షల టాయిలెట్లు అంటే.. నిమిషానికి 84 టాయిలెట్లకు పైగా కట్టారా" అంటూ నిలదీశారు. మోదీ చెప్పే మోసపూరిత మాటలకు ఇదే పరాకాష్ట అని పేర్కొన్నారు. కనీసం బీహార్ ముఖ్యమంత్రి కూడా మోదీ అబద్ధాలను నమ్మరేమో" అని ట్వీట్ చేశారు.








Untitled Document
Advertisements