గోల్డ్కోస్ట్, ఏప్రిల్ 14 :ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా జరుగుతున్నా 21 వ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ బాక్సర్ మేరీకోమ్ సరికొత్త రికార్డు సృష్టించింది. కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు బాక్సింగ్లో తొలి పసిడి పతకాన్ని అందించిన మహిళగా రికార్డులకెక్కింది. మణిపూర్ కు చెందినా మేరీ కోమ్ ఫైనల్లో ఉత్తర ఐర్లండ్కు చెందిన క్రిస్టినా ఓహరను పదునైన పంచ్లతో మట్టికరిపించింది.
మరో బాక్సర్ గౌరవ్ సోలంకీ కూడా సత్తా చాటాడు. పురుషుల 52 కిలోల విభాగంలో ప్రత్యర్థిని ఓడించి స్వర్ణపతకాన్ని సొంతం చేసుకున్నాడు. షూటర్ సంజీవ్ రాజ్పుత్ సైతం కామన్వెల్త్ క్రీడల్లో భారత పతకాన్ని రెపరెపలాడించాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3పొజిషన్స్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించాడు. దీంతో ఇప్పటివరకు భారత్ 20 స్వర్ణపతకాలు సాధించి.. పతకాల పట్టికలో మూడోస్థానంలో కొనసాగుతుంది.