మొహాలీ, ఏప్రిల్ 16 : ఐపీఎల్-11 సీజన్ మొదలైంది. మ్యాచ్ లు జరుగుతున్నా కొద్ది అభిమానులు సూపర్ మజాను ఆస్వాదిస్తున్నారు. కానీ ఎక్కడో వెలితి.. యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ విద్వంసకారుడు క్రిస్ గేల్ మెరుపులు చూడలేకపోయామని.. కానీ ఆ ఆశ నిన్న చెన్నై సూపర్కింగ్స్- పంజాబ్ కింగ్స్ X1 మ్యాచ్ తో తీరిపోయింది. ఈ సీజన్లో తొలిసారి కింగ్స్ ఎలెవన్ తరఫున ఆడిన గేల్ చాహర్ వేసిర ఆరో ఓవర్లో రెచ్చిపోయి రెండు ఫోర్లు, రెండు సిక్స్లు బాదాడు. 33 బంతుల్లో 63 పరుగులు చేసి పంజాబ్ జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు.
మ్యాచ్ తర్వాత 'మ్యాన్ అఫ్ ది మ్యాచ్' అందుకొన్న గేల్ మాట్లాడుతూ .. "ఈ రోజు మ్యాచ్లో ఆడుతున్నట్లు ఉదయం తెలిసింది. కొత్త ఫ్రాంఛైజీ తరఫున బరిలోకి దిగిన తొలి మ్యాచ్లోనే విజయంతో చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను 25 ఏళ్ల వయస్సు వాడిలా ఫీలవుతున్నాను. ది యూనివర్స్ బాస్ ఈస్ బ్యాక్" అని గేల్ నవ్వుతూ వ్యాఖ్యానించాడు.