హైదరాబాద్, ఏప్రిల్ 16 : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం విడుదలకు ముందే ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. సినిమా ఫస్ట్ లుక్ నుండి.. ట్రైలర్.. పాటల వరకు ఒక్కోటి ఒక్కో రికార్డును సొంతం చేసుకుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. జీరో కట్స్తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కైరా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.