హైదరాబాద్, ఏప్రిల్ 17 : 'జయ జానకి నాయక' సినిమా తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్నతదుపరి చిత్రం 'సాక్ష్యం'. 'నేచర్ ఈజ్ ది విట్ నెస్' అనే కాప్షన్ తో విడుదలైన పోస్టర్ కూడా ఆకట్టుకుంది. పూజ హెగ్డే బెల్లంకొండ శ్రీనివాస్ కు జోడీగా నటిస్తుంది. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ నామ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ యూఎస్ లో జరుగుతుంది.
ప్రకృతిలోని పంచభూతాలు ఆధారంగా ఈ చిత్రం రాబోతుందని సమాచారం. ఈనెల 18న టీజర్ విడుదల చేస్తున్నామని నిర్మాత తెలిపారు. ఈ సినిమా జూన్ 14న చిత్రం విడుదలకి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. మీనా, శరత్ కుమార్, జగపతిబాబు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.