కర్ణాటకలో నకిలీ నోట్ల కలకలం

     Written by : smtv Desk | Wed, Apr 18, 2018, 03:36 PM

కర్ణాటకలో నకిలీ నోట్ల కలకలం

బెంగళూరు, ఏప్రిల్ 18 : వచ్చే నెలలో కర్ణాటక రాష్ట్రంలో జరిగే ఎన్నికల కోసం ఆధికారంలోకి రావడానికి అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో నకిలీ కరెన్సీ రాష్ట్రంలో కలకలం పుట్టిస్తోంది. తాజాగా బుధవారం బెలగవిలో పోలీసుల తనిఖీల్లో భారీగా నకిలీ కరెన్సీ పట్టుబడింది. ఈ సందర్భంగా ఏడు కోట్ల రూపాయల విలువైన నకిలీ కరెన్సీని అధికారులు స్వాధీనం పరుచుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అరెస్టు చేశారు. కాగా వచ్చేనెల 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఆయా పార్టీలు రంగంలోకి దిగినట్టు కనిపిస్తోంది. ఈ అంచనాలకు ఊతమిస్తూ మంగళవారం అక్రమంగా భారీగా నగదును తరలిస్తూ పలువురు పట్టుబడ్డారు. ఒక ప్రైవేటు బస్సులో వంద కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.





Untitled Document
Advertisements