హైదరాబాద్, ఏప్రిల్ 18 : బెల్లంకొండ శ్రీనివాస్.. పూజా హెగ్డే జంటగా నటిస్తున్న "సాక్ష్యం" చిత్ర టీజర్ విడుదలైంది. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఈ టీజర్ లో.. "భూమ్మీద తప్పు చేసిన ప్రతి ఒక్కరు నన్ను ఎవరు చూడలేదనుకుంటారు. కాని ఆ ఐదవ దిక్కు ఒకటి ఎప్పుడూ మనల్ని చూస్తూనే ఉంటుంది. అదే కర్మసాక్షి. దాన్నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదు" అంటూ ప్రారంభమవుతోంది. ప్రముఖ నటి మీనా చేతిలో చిన్న బాబుతో ఏడుస్తూ కనిపించింది. అలాగీ ఎంతో ఆవేశంతో ఒక ముని.. దాచడానికి ఇది శవం కాదు సాక్ష్యం.. అంటూ చెప్తున్న డైలాగ్ ఆకట్టుకుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా విడుదల తేదీ ఇంకా తెలియాల్సి ఉంది.