మోదీ మౌనం వీడండి : మన్మోహన్‌ సింగ్‌

     Written by : smtv Desk | Wed, Apr 18, 2018, 05:49 PM

మోదీ మౌనం వీడండి : మన్మోహన్‌ సింగ్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: యావత్ భారతదేశ ప్రజలను విస్మయానికి గురి చేసిన కథువా, ఉన్నావ్ కేసులు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇంతా జరుగుతున్నా ప్రధాని మోదీ మౌనం వహించడంపై మాజీ ప్రధాని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఘాటుగా స్పందించారు. ఈ విషయంపై మన్మోహన్‌ మాట్లాడుతూ.. "నేను మాట్లాడటం లేదని నన్ను ‘మౌన్‌ మోహన్‌ సింగ్‌’అని అన్నారు. మాట్లాడటం నేర్చుకోవాలని నాకు సలహాలు ఇచ్చారు. ఇప్పుడు మీరు అదే సూత్రాన్ని అనుసరిస్తున్నారు. బ్యాంకింగ్ మోసాలు, మైనారిటీ, దళితులపై జరుగుతున్న అరాచకాలపై నోరు మెదపరెందుకు..? మహిళలపై, పిల్లలపై జరుగుతున్న అరాచకాలకు మీరిచ్చే సమాధానమేంటి...?" అని ప్రధానిని మన్మోహన్‌ సూటిగా ప్రశ్నించారు.





Untitled Document
Advertisements