ఏపీ జీవీఏ వృద్ధి రేటు.. ప్రాధాన్యతపై సీఎస్ సమీక్ష..!

     Written by : smtv Desk | Wed, Apr 18, 2018, 06:38 PM

ఏపీ జీవీఏ వృద్ధి రేటు.. ప్రాధాన్యతపై సీఎస్ సమీక్ష..!

అమరావతి, ఏప్రిల్ 18 : ఏపీ సీఎస్‌ దినేష్‌ కుమార్‌.. 2018-19 వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయం, పారిశ్రామిక, మౌలిక రంగాల్లో జీవీఏ(గ్రాస్ వాల్యూ ఏడెడ్) వృద్ధి రేటు, హై ఇంపాక్ట్ ప్రాధాన్యత ప్రాజెక్టులు అంశాలపై నేడు అమరావతిలో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు అన్ని శాఖల్లోను సమాచారం సేకరణ.. అన్ని విధాలా రిపోర్టింగ్ విధానాలను మెరుగుపర్చుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

జీవీఏకు సంబంధించి ఇంకా సాధించాల్సిన లక్ష్యాలపై మైలురాళ్లను నిర్దేశించుకుని ఆ ప్రకారం నెలవారీ లేక త్రైమాసిక పరంగా సాధించిన ప్రగతిని క్వాలిటేటివ్ గా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెద్ద మొత్తంలో నిర్మాణపరమైన పనులు జరుగుతున్నందున ఎంతమేర సిమెంట్, ఇనుము వినియోగం జరిగిందనే అంశంపై సమాచారం సేకరించి జీవీఏలో ఈ రంగాన్ని కూడా లెక్కించాల్సిన అవసరం ఉందన్నారు.





Untitled Document
Advertisements