హైదరాబాద్, ఏప్రిల్ 18 : 'ప్రేమికా మనస్సుపై స్వారీ చేసేయ్.. ప్రేమికా' అంటూ 'నా నువ్వే' సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఎఫ్ఎం ఆర్జేగా 'లవ్ లవ్ లవ్' అంటూ తమన్నా డైలాగ్ చెప్పిన టీజర్ ఇదివరకే విడుదలై ఆకట్టుకుంది. 'నా నువ్వే' సినిమా తదుపరి చిత్రానికి సంబంధించిన మరో కొత్త వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. తెలుగులో నాని, జల్సా, బాద్ షా, 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి సినిమాలకి పని చేసిన ప్రముఖ ఛాయాగ్రాహకుడు 'గుహన్' దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నటించనున్నారని సమాచారం. గుహన్ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే అంగీకరించినట్లు తెలుస్తుంది.
ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నారట. నివేదా థామస్, షాలినిపాండే కథానాయికలుగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 'ఐందు ఐందు' గా హ్యాపీ డేస్ సినిమాని తమిళంలో రిమేక్ చేసి దర్శకునిగా నిరుపించుకున్న ఛాయాగ్రాహ దర్శకుడు గుహన్ కళ్యాణ్ రామ్ తో ఎంతవరకు సఫలీకృతం అవుతాడో వేచి చూడాలి.