హైదరాబాద్, ఏప్రిల్ 19 : రెబల్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న "సాహో" చిత్రంలో బాలీవుడ్ భామ శ్రద్దాకపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో చాలా మంది బాలీవుడ్ కి సంబంధి౦చిన వారే నటిస్తుండడం గమనార్హం.
యాక్షన్ అడ్వెంచరస్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మరో బాలీవుడ్ భామ ఎవ్లిన్ శర్మ నటించనున్నట్లు తెలుస్తోంది. 'సాహో'లో తన పాత్ర కోసం ఈ ముద్దుగుమ్మ పది కిలోలు తగ్గారట. ఈ సినిమాలో ఎవ్లిన్ యాక్షన్ ఘట్టాల్లో కన్పించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం దుబాయ్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2019 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.