చండీగఢ్, ఏప్రిల్ 20 : టీ-20ల్లో యూనివర్సల్ బాస్ గా పిలుచుకొనే క్రిస్ గేల్ హైదరాబాద్ పై పంజా విసిరాడు. గత మ్యాచ్ లో ఆర్ధశతకం సాధించిన ఈ పంజాబ్ ఆటగాడు నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో (104 నాటౌట్ 63 బంతుల్లో 1×4, 11×6) సెంచరీ తో చెలరేగిపోయాడు. ముఖ్యంగా బౌలింగ్ అత్యంత బలమైన జట్టు అయిన రైజర్స్ బౌలర్లను గేల్ సుడిగాలి ఇన్నింగ్స్ తో ఊచకోత కోశాడు.
తొలుత టాస్ నెగ్గిన పంజాబ్ సారథి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కింగ్స్ x1 జట్టులో గేల్ ఆటే హైలెట్. 11 సిక్స్లు కొట్టిన అతడి ఖాతాలో ఒక్క ఫోరే ఉండడం విశేషం. ముఖ్యంగా హైదరాబాద్ బౌలర్ రషీద్ ఖాన్ వేసిన 14 ఓవర్లో ఏకంగా నాలుగు సిక్స్లు బాదాడు. మరో పక్క కరుణ నాయర్ (31) తో రాణించాడు.
తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన సన్ రైజర్స్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్లో బరిందర్ శరణ్ వేసిన బంతి ఎడమ మోచేయిని బలంగా తగడంలో ఓపెనర్ ధావన్ (0) రిటైర్డ్హర్ట్గా వెనుదిరిగాడు. తర్వాత కెప్టెన్ విలియంసన్ (54) , పాండే (57), పోరాడిన జట్టును గెలిపించాలేకపోయారు. శతక వీరుడు క్రిస్ గేల్ కు 'మ్యాన్ అఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.