రాహుల్‌తో ఉత్తమ్‌ భేటీ

     Written by : smtv Desk | Fri, Apr 20, 2018, 03:16 PM

రాహుల్‌తో ఉత్తమ్‌ భేటీ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఢిల్లీలో భేటీ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం చోటుచేసుకున్న రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించారు. కాంగ్రెస్‌ పార్టీ చేపడుతున్న బస్సు యాత్రలో రాహుల్‌గాంధీ పాల్గొంటారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల అసెంబ్లీ బహిష్కరణకు గురైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లకు హైకోర్డులో ఊరట లభించిన విషయాన్ని రాహుల్‌కు వివరించినట్లు చెప్పారు.

న్యాయస్థానంలో పోరాడి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలను ఆయన అభినందించినట్లు తెలిపారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్‌ మధుసూదనాచారి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ అప్రజాస్వామికంగా వ్యవహరించారని విమర్శించారు. పదవులను దుర్వినియోగ పరిచిన కేసీఆర్‌, మధుసూదనాచారి వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.





Untitled Document
Advertisements