హైదరాబాద్, ఏప్రిల్ 20 : బాలీవుడ్ నటులు రణ్బీర్ కపూర్, దీపిక పదుకొణె గతంలో ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఏవో మనస్పర్థలు వచ్చి విడిపోయారు. అయినా అప్పుడప్పుడు ఈ మాజీ ప్రేమ జంట పలు కార్యక్రమాలలో సందడి చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఈ ఇద్దరు కలిసి ఓ ఫ్యాషన్ షో లో పాల్గొని సందడి చేశారు.
ముంబై లో 2018 మిజ్వాన్ ఫ్యాషన్ షోలో దీపిక, రణ్బీర్ లు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తులనే వేసుకొని ఒకరికొకరు చేతిలో చేయి వేసుకొని ర్యాంప్ వాక్ చేశారు. దీపిక లెహెంగాలో మెరిసిపోగా.. రణ్బీర్ షేర్వాణీలో ఆకట్టుకున్నారు. ఈ షో ద్వారా వచ్చిన డబ్బులను ప్రముఖ నటి షబానా అజ్మీ మిజ్వాన్ ఎన్జీవోకు విరాళంగా ఇవ్వనున్నారు. కాగా వీరిద్దరి ర్యాంప్ వాక్ ను చూసిన అభిమానులు, నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన ఓ కార్యక్రమ౦లో దీపిక, రణ్బీర్ లు కలిసి డాన్స్ చేశారు.