మోదీపై బాలకృష్ణ ఘాటు వ్యాఖ్యలు

     Written by : smtv Desk | Fri, Apr 20, 2018, 03:35 PM

మోదీపై బాలకృష్ణ ఘాటు వ్యాఖ్యలు

విజయవాడ,ఏప్రిల్ 20: ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఘాటుగా స్పందిచారు. విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన ఒక్కరోజు దీక్షలో మాట్లాడిన ఆయన.. మోదీని శిఖండి అని, తరిమితరిమి కొడతామని అన్నారు.

నువ్వొక ద్రోహివి.. తరిమికొడతాం..: ‘‘సామదానబేధదండోపాయాలు అంటారుకదా.. ఇప్పుడు చివరి దశలో ఉన్నాం. మోసం చేసిన మోదీని తరిమితరిమి కొట్టాలి. ఒక్క ఏపీలోనేకాదు దేశమంతటా ఆయనపై వ్యతిరేకత ఉంది. మోదీ.. నీకు తెలుగువాళ్ల ఘోష వినిపించట్లేదా? అయితే ముందు తెలుగు నేర్చుకో. దానితోపాటు పెద్దల్ని గౌరవించడం నేర్చుకో. అన్నింటికన్నా ముఖ్యంగా నీ భార్యను ప్రేమించడం తెలుసుకో. నీకు బాకా ఊదేవాళ్ల మాటలు వినకు. ఏపీకి అన్యాయం చేసిన నువ్వు ఒక ద్రోహివి. నిన్ను కొట్టి కొట్టి తరుముతాం, బంకర్‌లో దాక్కున్నా లాక్కొచ్చి బాదుతాం. ఒకప్పుడు నీ బీజేపీకి రెండు సీట్లు కూడా లేవు. వచ్చే ఎన్నికల్లో ఒక్కసీటు కూడా రాదు. చిల్లర రాజకీయాలు, కుప్పిగంతులు మానెయ్‌. ఎవరెవరినో అడ్డం అడ్డంపెట్టుకుని వ్యవహారాలు సాగిస్తున్నశిఖండివి నువ్వు’’ అని బాలకృష్ణ అన్నారు.







Untitled Document
Advertisements