ముంబై, ఏప్రిల్ 20 : బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.. తమిళ రీమేక్ లో నటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. విజయ్ సేతుపతి, మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన "విక్రమ్ వేధ" అనే సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 13 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడిన ఈ సినిమా.. దాదాపు 65 కోట్ల వరకూ వసూలు చేసింది. అయితే ఈ చిత్రాన్ని షారుక్ ఖాన్ తో హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తమిళంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు కాకుండా హిందీలో నీరజ్ పాండే పనిచేయనున్నట్లు తెలుస్తోంది. తమిళంలో విజయ్ పోషించిన పాత్రను షారుక్ చేస్తాడట. మరి మాధవన్ గా ఎవరు నటిస్తారనేది ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం షారుఖ్.. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో "జీరో" సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అనుష్క శర్మ, కత్రినా కైఫ్ లు కథానాయికలుగా నటిస్తున్నారు.