హైదరాబాద్, ఏప్రిల్ 20: ప్రయాణీకుల రద్దీ దృష్టా నగరంలో ఇక అదనపు మెట్రో రైళ్ళు నడవనున్నాయి. మియాపూర్- అమీర్పేట్- నాగోల్ మధ్య రద్దీ సమయాల్లో 7 నిమిషాలకో మెట్రో టైన్ నడవనుంది. ఈ విషయాన్ని ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి రద్దీ సమయాల్లో ప్రతి 7 నిమిషాలకో మెట్రో రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
కొత్త సిగ్నలింగ్ వ్యవస్థకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ(సీఎంఆర్ఎస్) అనుమతి ఇచ్చిందని ఆయన తెలిపారు. ఈ విషయం నగర ప్రయాణికులతో పంచుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్ ట్వీట్ చేశారు.