హైదరాబాద్, ఏప్రిల్ 20: నగరంలో యువతి, యువకుడు అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ఖైరతాబాద్లోని ఓ అపార్ట్మెంట్లో వర్షశ్రీ అనే యువతి, మహేశ్వర్రెడ్డి అనే యువకుడు మృతి చెంది ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో రక్తం మరకలు, తీవ్రగాయాలతో యువతి, ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న స్థితిలో యువకుడి మృతదేహాలు ఉన్నాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.