"భరత్" పై రాజమౌళి ప్రశంసలు..

     Written by : smtv Desk | Fri, Apr 20, 2018, 06:51 PM


హైదరాబాద్, ఏప్రిల్ 20 : సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన "భరత్ అనే నేను" చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. కైరా అద్వానీ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

అయితే తాజాగా ఈ చిత్రాన్ని చూసిన దర్శకధీరుడు రాజమౌళి.. సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబుపై ప్రశంసల వర్షం కురిపించాడు. "ఒక కమర్షియల్ సినిమాలో లోకల్ గవర్నెన్స్ లాంటి ఇష్యూస్‌ని లేవనెత్తాలంటే చాలా ధైర్యం కావాలి. చాలా మంచి మూమెంట్స్ ఉన్న ఈ సినిమాలో ప్రెస్ మీట్ సీన్ ది బెస్ట్. మహేష్ తన బెస్ట్ పెర్ఫార్మెన్స్‌ని ఇచ్చాడు. కొరటాల శివ, మహేష్ బాబును వారి నమ్మకాన్ని అభినందిస్తున్నా. 'భరత్ అనే నేను' టీమ్ మొత్తానికి నా శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశారు.





Untitled Document
Advertisements