"మూగమనసులు" సాంగ్‌ రిలీజ్..

     Written by : smtv Desk | Fri, Apr 20, 2018, 07:11 PM


హైదరాబాద్, ఏప్రిల్ 20 : అలనాటి మేటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న "మహానటి" చిత్రంలో కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. సమ౦త, దుల్కర్ సల్మాన్, మోహన్ బాబు, విజయ్ దేవరకొండ, శాలినీ పాండే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి "మూగమనసులు" అనే లిరికల్ సాంగ్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించగా.. శ్రేయాఘోషల్, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. కీర్తి సురేష్ సావిత్రి పాత్ర పోషించగా ఆమె భర్త పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించారు. వీరిద్దరి పైనే ఈ పాటను చిత్రీకరించారు. వైజయంతీ మూవీస్-స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.





Untitled Document
Advertisements