సంక్షోభంలో రాజ్యాంగం: ర‌ఘువీరారెడ్డి

     Written by : smtv Desk | Sat, Apr 21, 2018, 11:34 AM

సంక్షోభంలో రాజ్యాంగం: ర‌ఘువీరారెడ్డి

విజయవాడ, ఏప్రిల్ 20: దేశంలో రాజ్యాంగం తొలిసారిగా సంక్షోభంలో పడిందని, దాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా సంఘాల ఛైర్మన్‌లతో ఆయన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని తొలగించే అజెండాను బీజేపీ సర్కారు తయారుచేస్తోందని అన్నారు.

అలాగే ఎస్సీ, ఎస్టీలపై కేసులను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, రిజర్వేషన్లు తొలగించాలన్నదే వారి రహస్య అజెండా అని ఆరోపించారు. రాజ్యాంగం నుంచి సెక్యులర్ పదాన్ని కూడా తొలగించాలనుకుంటున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యం మీద ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలకు నమ్మకం లేదని అన్నారు.





Untitled Document
Advertisements