హైదరాబాద్, ఏప్రిల్ 21 : నకిలీ బంగారాన్ని కుదువ పెట్టి రుణం పొందిన కేసులో సినీహీరో రాజ్తరుణ్ తండ్రికి మూడేళ్ల జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. వైజాగ్ వేపగుంటలో నివసించే బసవరాజు 2013 నుండి ఎస్బీఐ బ్యాంకులో స్పెషల్ క్యాషియర్ గా విధులు నిర్వహి౦చేవారు. అయితే బసవరాజు తన భార్య రాజ్యలక్ష్మితో పాటు ఎం.ఎస్.ఎన్.రాజు, ఎన్.సన్యాసిరాజు, కె.సాంబమూర్తి, ఎన్.వెంకట్రావు పేర్ల మీద నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి బ్యాంకులో రూ.9.85 లక్షల రుణాలు పొందారు.
బ్యాంకు అధికారులు తనిఖీలు నిర్వహించగా అది నకిలీ బంగారమని తేలింది. దీంతో బ్యాంకు మేనేజర్ గరికిపాటి సుబ్రహ్మణ్యం గోపాలపట్నం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు విచారణ చేపట్టారు. ఈ మేరకు విశాఖపట్నం రెండో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ బసవరాజుకు మూడు నెలల జైలు శిక్ష విధి౦చడంతో పాటు 20,000 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.