ఓవర్సీస్ లోనూ దూసుకెళ్తున్న "భరత్ అనే నేను"

     Written by : smtv Desk | Sat, Apr 21, 2018, 03:22 PM

ఓవర్సీస్ లోనూ దూసుకెళ్తున్న

హైదరాబాద్, ఏప్రిల్ 21 : మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటించిన "భరత్ అనే నేను" చిత్రం రికార్డుల వేటలో దూసుకుపోతోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి మార్కులే పడ్డాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలైన తొలిరోజు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 37.25 కోట్లను రాబ‌ట్టిన‌ట్టు తెలుస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.22 కోట్ల క‌లెక్ష‌న్లు సాధించగా.. చెన్నైలో తొలిరోజు దాదాపు రూ. 27 ల‌క్ష‌ల క‌లెక్ష‌న్లు సాధించి.. కొత్త రికార్డును సృష్టించింది. ఇక ఓవర్సీస్ లోనూ భరత్ దూసుకెళ్తున్నాడు. ఓవర్సీస్ లో ఇప్ప‌టికే మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్‌లోకి చేరిన‌ట్టు సినీ విశ్లేష‌కులు చెబుతున్నారు. మహేష్ సరసన కైరా అద్వానీ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.





Untitled Document
Advertisements