ఎదురు కాల్పుల్లో జవాను మృతి

     Written by : smtv Desk | Sat, Apr 21, 2018, 03:30 PM

ఎదురు కాల్పుల్లో జవాను మృతి

ఛత్తీస్ గడ్, ఏప్రిల్ 21: సుకుమా జిల్లాలో గత రాత్రి సీఆర్పీఎఫ్ జవాన్లకు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కిష్టారం పరిధిలో జరిగిన ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ 212 బెటాలియన్‌కు చెందిన జవాన్ మృతి చెందగా.. ఇన్ స్పెక్టర్ రఘువీర్ సింగ్‌తో సహా నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. సంఘటనా ప్రదేశానికి చేరుకున్న అదనపు బలగాలు మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కాల్పుల నేపధ్యంలో ఎప్పుడు ఎంజరుగుతుందోనని సమీప ప్రాంతాల ప్రజలు భయా౦దోళన చెందుతున్నారు.





Untitled Document
Advertisements