హైదరాబాద్, ఏప్రిల్ 21 : అన్నపూర్ణ స్టూడియోస్ లో సినీపెద్దలు ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రస్తుతం సినీ పరిశ్రమలో జరుగుతున్న సంఘటనలు, లైంగిక వేధి౦పులు సహా పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.
పరిశ్రమ పెద్దలు తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు కాసేపట్లో సచివాలయంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో సినీపెద్దల౦తా భేటీ కానున్నారు. నిజానికి ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరవుతారని అంతా భావించారు. కాని భద్రతా కారణాల దృష్ట్యా పవన్ హాజరు కాలేకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
24 క్రాఫ్ట్స్ కు చెందిన పలువురు ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే సమావేశం ముగిసిన తర్వాత 'మా' అధ్యక్షుడు మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోవడం గమనార్హం. కాగా ఈరోజు సాయంత్రం తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.