హైదరాబాద్, ఏప్రిల్ 20: వేసవి సెలవుల్లో ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో తరగతులు నిర్వహించడంపై తీవ్ర వివాదం చెలరేగుతున్న తరుణంలో ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు శుక్రవారం పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర తరగతులను నిర్వహిస్తున్న 36 కార్పొరేట్ కాలేజీలకు శుక్రవారం ఇంటర్ విద్యా అధికారులు తాళాలు వేశారు. మేడ్చెల్ జిల్లాలో 13, హైదరా బాద్లో 15, రంగారెడ్డి జిల్లాలో 8 కాలేజీలకు తాళాలు వేశారు.