వార్తాపత్రికలు ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లించాలి: పీసీఐ

     Written by : smtv Desk | Sat, Apr 21, 2018, 06:10 PM

వార్తాపత్రికలు ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లించాలి: పీసీఐ

హైదరాబాద్‌, ఏప్రిల్ 21: వార్తాపత్రికలు, ఏజెన్సీలు చెల్లించే మొత్తాన్ని ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లించాలని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ) సూచించింది. ఆ మొత్తాన్ని Sabpaisa& Allbank Qwikcollect లింకు ద్వారా అలహాబాద్‌ బ్యాంకు అకౌంటు నంబర్‌కు చెల్లించాలని పేర్కొంది. ఆన్‌లైన్‌ లింకు, ఇతర చెల్లింపు వివరాలను http://presscouncil.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రతి వార్తా పత్రికకు శాశ్వత యూనిక్‌ ఐడీని కేటాయిస్తామని, దాని ద్వారా చెల్లింపులు జరపాలని పేర్కొంది. ఆఫ్‌లైన్‌ ద్వారా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాలను వెంటనే నిలిపేస్తున్నట్లు వెల్లడించింది.





Untitled Document
Advertisements