ఆఫ్ఘనిస్థాన్ లో ఆత్మాహుతి దాడి..

     Written by : smtv Desk | Sun, Apr 22, 2018, 03:23 PM

ఆఫ్ఘనిస్థాన్ లో ఆత్మాహుతి దాడి..

కాబూల్, ఏప్రిల్ 22 : ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో ఆదివారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఎన్నికల నమోదు కేంద్రం వద్ద ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో 31 మంది మృతి చెందగా, 50 మంది క్షతగాత్రులయ్యారని సమాచారం. ఆఫ్ఘనిస్థాన్ ఇంటీరియర్ మినిస్ట్రీ అధికార ప్రతినిథి నజీబ్ దనేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఓ బాంబర్ నడుస్తూ వచ్చాడని, ఎన్నికల నమోదు కేంద్రం వద్ద అధికారులు ఐడీ కార్డులు జారీ చేస్తుండగా, ఆ బాంబర్ తనను తాను పేల్చుకున్నాడని వెల్లడించారు. ఈ దాడికి ఎవరు పాల్పడ్డారో స్పష్టంగా తెలియడం లేదు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.





Untitled Document
Advertisements