హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా గోదావరి నీటిని అధికారులు ప్రాజెక్టులోకి తరలించారని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరికి చెందిన 11 మంది హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్ను విచారించిన కోర్టు.. పిటిషనర్లకు ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ఆదేశాలు జారీ చేశారు.