జన్ ధన్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్...లిమిట్ దాటితే చార్జీల బాదుడు

     Written by : smtv Desk | Wed, Apr 14, 2021, 01:12 PM

జన్ ధన్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్...లిమిట్ దాటితే చార్జీల బాదుడు

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన స్కీమ్స్‌లో జన్ ధన యోజన కూడా ఒకటి. దేశంలోని పేదలందరికీ బ్యాంక్ అకౌంట్ ఉండాలనే లక్ష్యంతో మోదీ సర్కార్ ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్ కింద జన్ ధన్ ఖాతా తెరవొచ్చు. ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్.

అంటే మీరు జన్ ధన్ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాల్సిన పని లేదు. ఇది బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్. మీకు ఈ బ్యాంక్ అకౌంట్ ఉంటే.. మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. బ్యాంకులు ఈ అకౌంట్ నుంచి ఎలాంటి చార్జీలు వసూలు చేయవు.

అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఉచిత లావాదేవీల పరిమితి దాటనంత వరకు ఎలాంటి చార్జీలు ఉండవు. ఒకవేళ పరిమితి దాటితే మాత్రం చార్జీలు చెల్లించుకోవాలి. నెలకు 4 ఉచిత లావాదేవీలు నిర్వహించొచ్చు. ఈ లిమిట్ దాటితే ప్రతి లావాదేవీకి రూ.20 వరకు చార్జీ పడుతుంది.

యూపీఐ, డిజిటల్ ట్రాన్సాక్షన్లకు కూడా ఇది వర్తిస్తుంది. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ.17.7 వసూలు చేసింది. ఎస్‌బీఐ 2015 నుంచి 20 వరకు ఐదేళ్ల కాలంలో 12 కోట్ల జీరో బ్యాలెన్స్ అకౌంట్ల నుంచి ఏకంగా రూ.300 కోట్లను చార్జీల రూపంలో వసూలు చేసింది. ఐఐటీ బాంబే నివేదికలో ఈ విషయం వెల్లడైంది.





Untitled Document
Advertisements