ఇంటికి రమ్మని ఫోన్ చేసిన ప్రియురాలు...వెళ్లిన ప్రియుడికి ఊహించని షాక్

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 08:52 PM

ఇంటికి రమ్మని ఫోన్ చేసిన ప్రియురాలు...వెళ్లిన ప్రియుడికి ఊహించని షాక్

మైనర్లు ఒకరినొకరు ఇష్టపడ్డారు. తరచూ బయట కలుసుకునేవారు. తీరా ఆ విషయం అమ్మాయి ఇంట్లో తెలిసిపోయింది. మందలించి దారికి తెచ్చుకోవడం మానేసి టీనేజ్ యువకుడిపై కోపం పెంచుకున్నారు. అతనిపై ఎలాగైనా కసి తీర్చుకోవాలని భావించారు. అందుకు కూతురినే ఎరగా వాడుకున్నారు. ఇంట్లో ఎవరూ లేరు.. రమ్మంటూ కూతురితో ఫోన్ చేయించారు. ప్రియురాలి మాటలు నమ్మేసిన యువకుడు ఆమె ఇంటికెళ్లాడు.. కానీ తిరిగిరాలేదు. ఈ అత్యంత దారుణ ఘటన కర్ణాటకలోని మాండ్యలో చోటుచేసుకుంది.

నగరంలోని కల్లజెళ్లి లేఅవుట్‌కి చెందిన టీనేజ్ యువకుడు(17)కి అదే ప్రాంతానికి చెందిన పదో తరగతి బాలికతో పరిచయమైంది. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. సాన్నిహిత్యం పెరగడంతో ఇద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. అప్పడప్పుడూ బయట కలుసుకునేవారు. కూతురి ప్రవర్తనలో తేడా గమనించిన తల్లిదండ్రులు నిఘా పెట్టడంతో అసలు విషయం తెలిసిపోయింది. కూతురికి నయానోభయానో సర్దిచెప్పడం మానేసి ఆమె ప్రియుడిపై కోపం పెంచుకున్నారు.

బాలిక తండ్రి నగరసభ సభ్యుడు, స్థానిక నేతగా పేరుంది. తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. కూతురి వ్యవహారం తెలిసి తల్లిదండ్రులు కోపంతో రగిలిపోయారు. ఎలాగైనా కూతురి ప్రియుడిపై కసి తీర్చుకోవాలని భావించారు. ఆమెతోనే ప్రియుడికి ఫోన్ చేయించి ఇంట్లో ఎవరూ లేరు.. ఇంటికి రమ్మని చెప్పించారు. అవేవీ తెలియని యువకుడు అమాయకంగా ఆమె ఇంటికి వెళ్లాడు. అప్పటికే వేచిచూస్తున్న బాలిక కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అతనిపై మూకుమ్మడి దాడి చేశారు.



టీనేజర్‌ని విచక్షణా రహితంగా చితకబాదారు. గమనించిన స్థానికులు వెంటనే యువకుడి తల్లిదండ్రులకి సమాచారం ఇవ్వడంతో అక్కడికి వచ్చారు. తమ కూతురు వెంటపడుతున్నాడంటూ కన్నవాళ్ల ముందే మళ్లీ చావబాదారు. తీవ్రగాయాలపాలైన యువకుడు అక్కడే కుప్పకూలి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా కొద్దిసేపటికి మృతి చెందాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు విచారణలో ఉంది.





Untitled Document
Advertisements