మైక్రోసాఫ్ట్ బోర్డ్ లో కీలక మార్పులు

     Written by : smtv Desk | Thu, Jun 17, 2021, 06:59 PM

 మైక్రోసాఫ్ట్ బోర్డ్ లో కీలక మార్పులు

టెక్ దిగ్గజం అయిన మైక్రోసాఫ్ట్ బోర్డ్ లో తాజాగా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం సీఈఓ అయిన సత్య నాదెళ్ల కి మరిన్ని కీలక బాధ్యతలను అప్పగించింది మైక్రోసాఫ్ట్. తాజాగా ఆయన్ను బోర్డ్ చైర్మన్ గా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ మేరకు ఏకగ్రీవం గా సత్యనాదెళ్ల పేరును ఆమోదించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఛైర్మన్ గా ఉన్న జాన్ థామ్సన్ ను స్వతంత్ర డైరెక్టర్ గా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 2014 లో సీఈఓ బాధ్యతలను స్వీకరించిన సత్య నాదెళ్ల ఇప్పుడు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడం తో సంస్థ కి మరిన్ని ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉందని తెలుస్తోంది.





Untitled Document
Advertisements