మళ్ళీ పెరిగిన పసిడి ధర...వెండి మాత్రం!

     Written by : smtv Desk | Tue, Jul 20, 2021, 01:52 PM

మళ్ళీ పెరిగిన పసిడి ధర...వెండి మాత్రం!

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఝలక్. పసిడి రేటు మళ్లీ పెరిగింది. పసిడి ప్రేమికులకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. నిన్న పడిపోయిన బంగారం ధర ఈరోజు పైకి కదలడం గమనార్హం. బంగారం పెరిగితే.. వెండి రేటు మాత్రం పడిపోయింది.

హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.90 పైకి కదిలింది. దీంతో బంగారం ధర రూ.49,090కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.10 పెరుగుదలతో రూ.45,000కు చేరింది.

బంగారం ధర పెరిగితే.. వెండి రేటు మాత్రం పడిపోయింది. హైదరాబాద్‌లో వెండి రేటు రూ.300 పతనమైంది. దీంతో కేజీ వెండి ధర రూ.72,900కు తగ్గింది. వెండి కడియాలు, పట్టీలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పైకి కదిలింది. 0.41 శాతం పెరిగింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1816 డాలర్లకు చేరింది. వెండి కూడా పెరిగింది. ఔన్స్‌కు 0.45 శాతం పెరుగుదలతో 25.25 డాలర్లకు చేరింది.

కాగా గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి.





Untitled Document
Advertisements