ఇంటి వద్ద నుంచే మొబైల్ నెంబర్‌ అప్‌డేట్

     Written by : smtv Desk | Wed, Jul 21, 2021, 11:14 AM

ఇంటి వద్ద నుంచే మొబైల్ నెంబర్‌ అప్‌డేట్

ఆధార్ మొబైల్ నెంబర్‌ను ఇప్పుడు ఇంటి వద్ద నుంచే అప్‌డేట్ చేసుకోవచ్చు. యూఐడీఏఐ కొత్త సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. పోస్ట్‌మ్యాన్ ద్వారా సులభంగానే ఇంటి వద్దనే ఆధార్ మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇండియాపోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ IPPB, యూఐడీఏఐ ఈ మేరకు ఒక ఒప్పందం చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, 1.46 లక్ల పోస్ట్‌మ్యాన్లు, గ్రామీణ్ డక్ సేవక్స్ ద్వారా ఈ సేవలు పొందొచ్చు. ఆధార్ కార్డు కలిగిన వారికి సులభంగానే సేవలు అందించడానికి యూఐడీఏఐ ప్రయత్నిస్తోందని, అందులో భాగంగానే ఇప్పుడు ఐపీపీబీ‌తో జత కట్టామని యూఐడీఏఐ సీఈవో సౌరభ్ జార్జ్ తెలిపారు. అంతేకాకుండా పోస్ట్‌మ్యాన్ల రానున్న కాలంలో చిన్న పిల్లలకు కూడా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సేవలు అందించనున్నారు.





Untitled Document
Advertisements