ఉద్యోగులకు శుభవార్త...ఆర్థిక శాఖ కీలక నిర్ణయం

     Written by : smtv Desk | Wed, Jul 21, 2021, 11:17 AM

ఉద్యోగులకు శుభవార్త...ఆర్థిక శాఖ కీలక నిర్ణయం

కేంద్ర ఆర్థిక శాఖ ఉద్యోగులకు తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. డియర్‌నెస్ అలవెన్స్ DA పెంపు అంశానికి సంబంధించి కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని ఆర్డర్లు జారీ చేసింది. మోదీ సర్కార్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 28 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచే ఈ పెంపును అమలు చేయాలని ఆర్థిక శాఖ ఇప్పుడు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో 48 లక్షల మందికి పైగా ఉద్యోగులకు, 65 లక్షల మందికి పైగా పెన్షనర్లకు ఊరట కలుగనుంది.

ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డీఏను 11 శాతం పెంచిన విషయం తెలిసిందే. దీంతో డీఏ 17 శాతం నుంచి 28 శాతానికి పెరిగింది. కాగా ఆర్థిక శాఖ కోవిడ్ 19 కారణంగా గత ఏడాది నుంచి డీఏ పెంపు చెల్లింపు వాయిదా వేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. మూడు ఇన్‌స్టాల్‌మెంట్ల డీఏ పెండింగ్‌లో ఉంచింది.





Untitled Document
Advertisements