బంగారం కొనే వారికి అలర్ట్

     Written by : smtv Desk | Wed, Jul 21, 2021, 04:55 PM

బంగారం కొనే వారికి అలర్ట్

బంగారం కొనుగోలు చేసే వారికి ముఖ్యమైన అలర్ట్. మోదీ సర్కార్ ఇప్పటికే గోల్డ్ హాల్ మార్కింగ్ రూల్స్‌ను అమలులోకి తీసుకువచ్చింది. అయితే ఇప్పుడు మోదీ సర్కార్ ఈ గోల్డ్ హాల్ మార్కింగ్ నిబంధనలను ఉపసంహరించుకుందనే వదంతులు సోషల్ మీడియాలో వ్యాపిస్తున్నాయి.

దీంతో మోదీ సర్కార్ ఈ విషయంపై స్పష్టతనిచ్చింది. గోల్డ్ హాల్ మార్కింగ్ రూల్స్ అమలులోనే ఉంటాయని, వాటిని ఉపసంహరించుకోలేదని పేర్కొంది. దశల వారీగా దేశవ్యాప్తంగా గోల్డ్ హాల్ మార్కింగ్ రూల్స్ అమలులోకి వస్తాయని తెలిపింది. గోల్డ్ జువెలరీ హాల్ మార్కింగ్ రూల్స్‌ను వెనక్కి తీసుకోలేదని స్పష్టత ఇచ్చింది.

అందువల్ల బంగారం కొనుగోలు చేసే వారు అలర్ట్‌గా ఉండాలి. గోల్డ్ హాల్ మార్కింగ్ నిబంధనలను అమలులో లేవని ఎవరైనా చెబితే నమ్మవద్దు. లేదంటే మోసపోవాల్సి వస్తుంది. తక్కువ నాణ్యత ఉన్న బంగారం కొనే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల నష్టపోవాల్సి వస్తుంది.

కచ్చితంగా గోల్డ్ హాల్ మార్కింగ్ ఉన్న బంగారు నగలను మాత్రమే కొనుగోలు చేయండి. అప్పుడు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీరు మళ్లీ ఆ బంగారాన్ని విక్రయించాలన్నా మంచి రేటు లభిస్తుంది. హాల్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి మోసపోవాల్సి ఉండదు.





Untitled Document
Advertisements