దేశంలో నిన్న 41,383 క‌రోనా కేసులు నమోదు

     Written by : smtv Desk | Thu, Jul 22, 2021, 11:54 AM

దేశంలో నిన్న 41,383 క‌రోనా కేసులు నమోదు

దేశంలో నిన్న కొత్తగా 41,383 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,12,57,720కు చేరింది. అలాగే, నిన్న 38,652 మంది కోలుకున్నారు.

మరణాల విషయానికొస్తే... నిన్న‌ 507 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,18,987కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,04,29,339 మంది కోలుకున్నారు. 4,09,394 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 41,78,51,151 వ్యాక్సిన్ డోసులు వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 45,09,11,712 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 17,18,439 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.





Untitled Document
Advertisements