కొత్తగా వ్యాపారం చేయాలనుకునేవారికి శుభవార్త...రూ.10 లక్షల వరకు లోన్

     Written by : smtv Desk | Thu, Jul 22, 2021, 11:58 AM

కొత్తగా వ్యాపారం చేయాలనుకునేవారికి శుభవార్త...రూ.10 లక్షల వరకు లోన్

మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. కొత్తగా వ్యాపారం చేయాలని భావించే వారికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు అందిస్తోంది. ఒక స్కీమ్ అందుబాటులో ఉంచింది. దీని పేరు ముద్రా యోజన. ఈ పథకం కింద వ్యాపారం చేయాలని భావించే వారు లోన్ పొందొచ్చు.

మీరు కొత్తగా వ్యాపారం చేయాలన్నా.. లేదంటే ఉన్న బిజినెస్‌ను మరింత విస్తరించుకోవాలన్నా.. మీరు ముద్రా స్కీమ్ కింద లోన్ పొందొచ్చు. రూ.10 లక్షల వరకు లోన్ తీసుకునే ఛాన్స్ అందుబాటులో ఉంది. బ్యాంకులు ఒక్కో విధంగా వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి. బ్యాంక్ ప్రాతిపదికన వడ్డీ రేట్లు మారుతుంది.

ముద్రా లోన్‌పై కనీస వడ్డీ రేటు 12 శాతం నుంచి ఉంటుందని చెప్పుకోవచ్చు. ముద్రా స్కీమ్ కింద మూడు కేటగిరిలు ఉంటాయి. శిశు, కిశోర్, తరుణ్ అనేవి లోన్ కేటగిరిలు. వీటి ప్రాతిపదికన మీకు లభించే లోన్ మొత్తం మారుతుంది. శిశు కేటగిరి కింద రూ.50 వేల వరకు, కిశోర్ లోన్ కింద రూ.5 లక్షల వరకు, తరుణ్ లోన్ కింద రూ.10 లక్షల వరకు లోన్ పొందొచ్చు.

మీరు బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల ద్వారా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఆన్‌లైన్‌లో http://www.mudra.org.in/ వెబ్‌సైట్ ద్వారా కూడా లోన్ పొందే అవకాశం ఉంది. మీ అర్హతల ప్రాతిపదికన మీకు లోన్ వస్తుందా? రాదా? అనే అంశం తెలుస్తుంది.





Untitled Document
Advertisements