"ధోనీతో కలిసి ఆడటం దీపక్ చాహర్‌కి కలిసొచ్చింది’’ ...మహ్మద్ కైఫ్

     Written by : smtv Desk | Thu, Jul 22, 2021, 03:11 PM


శ్రీలంకతో కొలంబో వేదికగా మంగళవారం రాత్రి ముగిసిన రెండో వన్డేలో భారత్ జట్టు గెలుపుపై ఆశలు వదిలేసిన మ్యాచ్‌ని దీపక్ చాహర్ (69 నాటౌట్: 82 బంతుల్లో 7x4, 1x6) అద్భుత ఇన్నింగ్స్‌తో గెలిపించాడు. భువనేశ్వర్ కుమార్‌తో కలిసి 8వ వికెట్‌కి అజేయంగా 84 బంతుల్లో 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన దీపక్ చాహర్.. మ్యాచ్‌ని ఫినిష్ చేసిన తీరు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని తలపించింది. చాహల్ ఇన్నింగ్స్‌పై మ్యాచ్ తర్వాత భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ స్పందిస్తూ ‘‘దీపక్ చాహర్ తాను ఎంత చురుకైన, తెలివైన పోరాట యోధుడో మనకి చూపించాడు. అతను మెంటల్‌గా చాలా స్ట్రాంగ్.. అలానే సరదాగా ఉండే మనిషి కూడా. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్ మహేంద్రసింగ్ ధోనీతో కలిసి చెన్నై సూపర్ కింగ్స్‌లో ఆడటం దీపక్ చాహర్‌కి కలిసొచ్చింది’’ అని మహ్మద్ కైఫ్ చెప్పుకొచ్చాడు.





Untitled Document
Advertisements