అన్నదాతలకు ప్రతి నెలా రూ.9 వేలు

     Written by : smtv Desk | Thu, Jul 22, 2021, 04:15 PM

అన్నదాతలకు ప్రతి నెలా రూ.9 వేలు

అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం పలు రకాల పథకాలు అందిస్తోంది. వీటి ద్వారా అన్నదాతలకు నేరుగానే లబ్ధి చేకూరుతోంది. బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు వచ్చి చేరుతున్నాయి. దీంతో చాలా మందికి ఊరట కలుగుతోంది. మోదీ సర్కార్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద ప్రతి ఏడాది రైతులకు రూ.6 వేలు అందిస్తోంది. అయితే ఈ డబ్బులు ఒకేసారి రావు. మూడు విడతల్లో అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతోంది. అంటే రూ.2 వేల చొప్పున రైతులకు పీఎం కిసాన్ డబ్బులు అందుతున్నాయి.

ఇవి కాకుండా రైతులు ప్రతి నెలా రూ.3 వేలు పొందే అవకాశం ఒకటి అందుబాటులో ఉంది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన పథకాన్ని కూడా అందిస్తోంది. ఇందులో చేరితే ప్రతి నెలా రూ.3 వేలు వస్తాయి. అయితే ఇవి 60 ఏళ్లు దాటిన తర్వాతనే లభిస్తాయి.

18 నుంచి 40 ఏళ్లలోపు వయసు ఉన్న వారు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లించాల్సి ఉంటుంది. వయసు ప్రాతిపదికన మీరు చెల్లించాల్సిన మొత్తం మారుతుంది. పీఎం కిసాన్ డబ్బుల నుంచి పీఎం కిసాన్ మాన్‌ధన్ డబ్బులు చెల్లించొచ్చు. ఆటోమేటిక్‌గానే బ్యాంక్ ఖాతా నుంచి కట్ అవుతాయి.





Untitled Document
Advertisements