'ఆర్ఆర్ఆర్' నిర్మాణం చివరిదశకు చేరుకుంది. దీంతో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను దర్శకుడు రాజమౌళి చిత్రీకరిస్తున్నారు. ఇక చిత్రాన్ని అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి మరోపక్క ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చిత్రం ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ప్రమోషనల్ సాంగును కూడా చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ బాణీలు కడుతున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ పాట చిత్రీకరణ కోసం ఆరున్నర కోట్ల వ్యయంతో భారీ సెట్స్ వేశారట. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఈ పాటలో రాజమౌళి హీరోలు ప్రభాస్, రానా, రవితేజలు మెరవనున్నట్టు తెలుస్తోంది. చిత్రంలోని ప్రధాన తారాగణమైన ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగణ్ తదితరులతో పాటు ప్రత్యేక గెస్టులుగా ప్రభాస్, రానా, రవితేజలు ఈ పాటలో కనిపిస్తారని తాజా సమాచారం.