వచ్చే నెల(ఆగస్ట్) నుంచి పలు అంశాలు మారబోతున్నాయి. దీని వల్ల చాలా మందిపై ప్రభావం పడే ఛాన్స్ ఉంది. అందువల్ల ఆగస్ట్ 1 నుంచి ఏ ఏ రూల్స్ మారబోతున్నాయో ఒకసారి తెలుసుకుందాం.
1. దేశీ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన ప్రైవేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ ICICI Bank ఒకటో తేదీ నుంచి కొత్త రూల్స్ తీసుకువస్తోంది. చెక్ బుక్, ఏటీఎం క్యా్ష్ విత్డ్రా రూల్స్ సవరించింది. కస్టమర్లు ఉచిత పరిమితి దాటిన తర్వాత చార్జీల బాదుడు భరించాల్సి ఉంటుంది.
2. ఆగస్ట్ 1 నుంచి ఆర్బీఐ కొత్త రూల్స్ అమలులోకి వస్తున్నాయి. దీంతో ఉద్యోగులకు, పెన్షనర్లకు, ఇంకా చాలా మందికి ఊరట కలనుగనుంది. ఆదివారం, సెలవు దినాల్లో కూడా వేతనాలు, పెన్షన్, వడ్డీ, డివిడెంట్ వంటివి అన్ని పొందొచ్చు. మీ ఖాతాల్లోకి వచ్చి చేరతాయి.
3. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సాధారణంగా ప్రతి నెలా ఒకటో తేదీ రోజున LPG ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తూ ఉంటాయి. ఈసారి కూడా ఇలాగే జరగొచ్చు.
4. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ఇప్పటికే బ్యాంకులకు ఏటీఎం లావాదేవీలకు సంబంధించి ఇంటర్ఛేంజ్ చార్జీలు పెంచుకోవచ్చని అనుమతి ఇచ్చింది. దీంతో 1వ తేదీ నుంచి బ్యాంకులు కస్టమర్లకు ఝలక్ ఇవ్వనున్నాయి. ఏటీఎం చార్జీలు పెరగొచ్చు.