YS వివేకానందరెడ్డి హత్యకేసు: రూ.8 కోట్ల సుపారీ... తొమ్మిది మంది?

     Written by : smtv Desk | Fri, Jul 23, 2021, 06:14 PM

YS వివేకానందరెడ్డి హత్యకేసు: రూ.8 కోట్ల సుపారీ... తొమ్మిది మంది?

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తును సీబీఐ చేపట్టిన నేపథ్యంలో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ జమ్మలమడుగు న్యాయస్థానంలో జడ్జి ఎదుట వాచ్ మన్ రంగన్న వాంగ్మూలం నమోదు చేశారు. ఈ కేసులో ప్రధానం ఆరుగురు వ్యక్తులను సీబీఐ పదేపదే ప్రశ్నించి కీలక వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. వివేకా అనుచరుడు ఎర్రగంగి రెడ్డి, పీఏ కృష్ణా రెడ్డి, డ్రైవర్ దస్తగిరి, పులివెందులకి చెందిన కృష్ణయ్య కుటుంబం, వాచ్‌మెన్ రంగన్న, ఇనాయతుల్లాను సీబీఐ అధికారులు పలుమార్లు విచారించారు.

సీబీఐ విచారణలో వాచ్‌మెన్ రంగన్న సంచలన విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ఎదుట రంగయ్య స్టేట్‌మెంట్ రికార్డు చేసినట్లు సమాచారం. వైఎస్ వివేకానంద రెడ్డిని సుపారీ గ్యాంగ్ హత్య చేసినట్లు చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆయన హత్యకు రూ.8 కోట్లు సుపారీ ఇచ్చారని.. తొమ్మిది మంది హత్య ప్రమేయం ఉన్నట్లు రంగన్న చెప్పాడని తెలుస్తోంది. హత్య జరిగిన రోజు ఇంటికి ఐదుగురు కొత్త వ్యక్తులు వచ్చినట్లు స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. ఇద్దరు ప్రముఖుల హస్తం కూడా ఉందని రంగన్న చెప్పినట్లు తెలుస్తోంది. రహస్యంగా వాచ్‌మెన్ స్టేట్‌మెంట్ రికార్డు చేసిన సీబీఐ అధికారులు ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఇంతకీ ఆ ఇద్దరు ప్రముఖులెవరన్నదీ సస్పెన్స్‌గా మారింది. త్వరలోనే ఈకేసు కొలిక్కి వస్తుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.





Untitled Document
Advertisements