కాంట్రాక్టు లెక్చరర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

     Written by : smtv Desk | Fri, Jul 23, 2021, 07:04 PM

కాంట్రాక్టు లెక్చరర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

డిగ్రీ కాలేజీలలో కాంట్రాక్టు పద్ధతిలో సేవలందిస్తున్న లెక్చరర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి కాంట్రాక్టును మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులను వెలువరించింది. వీరి సేవలను మరో ఏడాది పాటు వినియోగించుకోనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. 2021-22 విద్యా సంవత్సరానికి గాను వీరి సేవలను పొడిగిస్తున్నట్టు తెలిపింది. జూన్ 2021 నుంచి 10 రోజుల పాటు వీరి సేవలకు విరామం ఉంటుందని పేర్కొంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలల్లో పని చేస్తున్న 719 మంది కాంట్రాక్టు లెక్చరర్లకు మరో ఏడాది పని చేసే అవకాశం లభిస్తుంది.





Untitled Document
Advertisements