కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కావొస్తుండటంతో సిబ్బందికి ఇచ్చిన వర్క్ ఫ్రం హోం ఫెసిలిటీని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఎత్తేసింది. ఈ మేరకు తమ సిబ్బందికి గత వారం మెమో పంపినట్లు వార్తలొచ్చాయి. దీంతో 190 బిలియన్ డాలర్ల టర్నోవర్ గల ఇన్ఫోసిస్ తిరిగి ట్రాక్లోకి వచ్చేందుకు రంగం సిద్ధమైంది.