ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్..ఇలా చేయకపోతే సేవలు బంద్

     Written by : smtv Desk | Sat, Jul 24, 2021, 02:01 PM

ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్..ఇలా చేయకపోతే సేవలు బంద్

ఆన్‌లైన్, నెట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లతోపాటు ఆన్‌లైన్ మోసాలు కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో SBI కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంక్ కస్టమర్లు ఒక విషయం కచ్చితంగా తెలుసుకోవాలి.

ఇకపై ఎస్‌బీఐ మొబైల్ బ్యాంక్ సర్వీసులు పొందటం ఇక అంత ఈజీ కాదని గుర్తించుకోవాలి. ఎస్‌బీఐ అకౌంట్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ మీ స్మార్ట్‌ఫోన్ ఉంటేనే మీరు ఎస్‌బీఐ యోనో యాప్‌ను ఉపయోగించం సాధ్యమౌతుంది. లేకపోతే ఎస్‌బీఐ యోనో సేవలు పొందలేరు. ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. బ్యాంకింగ్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎస్‌బీఐ ఇలాంటి నిర్ణయం తీసుకుంది. తన యోనో యాప్ సెక్యూరిటీని మరింత పెంచేసింది. దీంతో మీరు ఎస్‌బీఐ యోనో యాప్ వాడాలంటే కచ్చితంగా రిజిస్టర్డ్ మొబైల్ మీ ఫోన్‌లో ఉండాల్సిందే.





Untitled Document
Advertisements