గాధి ఇతడు విశ్వామిత్ర మహర్షి తండ్రి. భరత సంతతిలోని కుశునకు వైదర్భి వల్ల నల్గురు కుమారులు జన్మించారు. అందులో కుశనాభుడు ఒకరు. ఇతనికి ఘ్రుతాచి అను దేవతాస్త్రీ వల్ల 100 మంది కుమార్తెలు కలిగారు, కాని కుమారులు లేరు. పుత్రకామేష్టి యాగం చేయగా గాధి జన్మించాడు. గాధి కుమార్తె సత్యవతి. ఆమెను ఋచీకుడు అను ముని వివాహమాడాడు. కుమార్తె వివాహం తరువాత తన కుమారుడు విశ్వామిత్రుడ్ని రాజ్యాభిషిక్తుడ్ని చేసి తపస్సు చేసుకోవడానికి అరణ్యానికి వెళ్ళాడు. కొంతకాలం ఋచీకుని ఆశ్రమంలో వుండి తరువాత స్వర్గానికి వెళ్ళాడు.