EPFO సబ్స్క్రైబర్లకు గుడ్ న్యూస్. పీఎఫ్ ఖాతాదారులకు ఈ నెలలో వడ్డీ డబ్బులు ఈపీఎఫ్ ఖాతాల్లో జమ కానుందని తెలుస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నెలలోనే వడ్డీ డబ్బులు పీఎఫ్ అకౌంట్లలో జమకావొచ్చు.
వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే.. పీఎఫ్ ఖాతాదారులకు ఈ నెల చివరి కల్లా పీఎఫ్ వడ్డీ డబ్బులు ఈపీఎఫ్ ఖాతాల్లో జమకానున్నాయి. మోదీ సర్కార్ 8.5 శాతం వడ్డీ రేటుకు అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే. ఇది గత ఏడేళ్లలో అతితక్కువ వడ్డీ రేటు అని చెప్పుకోవచ్చు.
2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.5 శాతం వడ్డీ డబ్బులు ఈ నెల చివరిలో లేదా వచ్చే నెల ప్రారంభంలో పీఎఫ్ ఖాతాదారులకు చేరనున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయ.