రూ.లక్ష పెడితే రూ.6 లక్షల రాబడి

     Written by : smtv Desk | Sat, Jul 24, 2021, 05:03 PM

రూ.లక్ష పెడితే రూ.6 లక్షల రాబడి

చేతిలోని డబ్బుతోనే మళ్లీ డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో స్టాక్ మార్కెట్ కూడా ఒకటి. ఇందులో డబ్బులు పెడితే అదిరిపోయే రాబడి పొందొచ్చు. కానీ అంతేస్థాయిలో భారీ రిస్క్ కూడా ఉంటుందని గమనించాలి.

మార్కెట్‌లో అదిరే లాభం పొందాలని భావిస్తే.. మల్టీ బ్యాగర్ స్టాక్స్‌ను కనిపెట్టాలి. వాటిల్లో డబ్బులు పెట్టాలి. అప్పుడే మీ డబ్బుకు అదిరిపోయే రాబడి వస్తుంది. 2021 చాలా మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఉన్నాయి. వీటిల్లో హెచ్ఎఫ్‌సీఎల్ కూడా ఒకటి. ఈ షేరు కూడా ఇన్వెస్టర్ల పంట పండించింది.

హెచ్ఎఫ్‌సీఎల్ అనేది టెలికం స్టాక్. ఈ షేరు ఏడాదిలోనే 500 శాత రాబడిని అందించింది. ఈ కాలంలో షేరు ధర రూ.12 నుంచి రూ.77కు పరుగులు పెట్టింది. దీంతో ఇందులో డబ్బులు పెట్టిన వారికి కళ్లుచెదిరే లాభం వచ్చిందని చెప్పుకోవచ్చు. గత నెల రోజుల్లో ఈ షేరు 16 శాతం రాబడిని అందించింది.

అదే గత ఆరు నెలల కాలంలో చూస్తే.. ఈ షేరు 151 శాతం ర్యాలీ చేసింది. ఇక గత ఏడాది కాలంలో అయితే 500 శాతం పరుగులు పెట్టింది. అంటే మీరు ఈ షేరులో ఏడాది కిందట రూ.లక్ష పెట్టి ఉంటే.. ఇప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్ విలువ రూ.6 లక్షలకు పెరిగి ఉండేది.





Untitled Document
Advertisements