ఓటమికి కారణాలు

     Written by : smtv Desk | Sat, Jul 24, 2021, 05:08 PM

ఓటమికి కారణాలు

తొలి రెండు వన్డేల్లో గెలిచి వన్డే సిరీస్‌ని కైవసం చేసుకున్న భారత్.. మూడో వన్డేకి ఆరు మార్పులతో బరిలోకి దిగింది. ఇందులో ఏకంగా ఐదుగురు ఆటగాళ్లకి కెరీర్‌లో ఇదే ఫస్ట్ వన్డే కావడం విశేషం. దాంతో.. ఒత్తిడిని అధిగమించలేకపోయిన ఈ కొత్త క్రికెటర్లు పేలవరీతిలో వికెట్లు చేజార్చుకున్నారు. మరీ ముఖ్యంగా.. నితీశ్ రాణా (7), కె.గౌతమ్ (2) కీలక సమయంలో పేలవరీతిలో ఔటైపోయారు. దాంతో.. ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ 40పైచిలుకు స్కోర్లు చేసినా.. భారత్ తక్కువ స్కోరుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

భారత్ జట్టు ఓటమిపై మ్యాచ్ తర్వాత శిఖర్ ధావన్ మాట్లాడుతూ ‘‘మ్యాచ్‌లో మాకు మెరుగైన ఆరంభం లభించింది. కానీ.. మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు చేజార్చుకున్నాం. దాంతో.. చివరికి ఆశించిన దానికంటే ఓ 50 పరుగులు తక్కువగా చేశాం. వన్డే సిరీస్ అప్పటికే దక్కడంతో.. కొత్త ఆటగాళ్లకి అవకాశం ఇచ్చాం. కానీ.. మేము ఆశించిన విధంగా ఫలితం రాలేదు. తప్పిదాల్ని దిద్దుకుని.. టీ20 సిరీస్‌లో సత్తాచాటుతాం’’ అని గబ్బర్ చెప్పుకొచ్చాడు. భారత్, శ్రీలంక మధ్య కొలంబో వేదికగా ఆదివారం నుంచి టీ20 సిరీస్ ప్రారంభంకానుంది.





Untitled Document
Advertisements